ఠారెత్తిస్తున్న ఎండలు
ABN , First Publish Date - 2022-05-21T06:38:44+05:30 IST
భానుడి భగభగలకు ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గం టల వరకు ఎండల ధాటికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
బెంబేలెత్తుతున్న జనం
మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యం
మాడుగుల రూరల్, మే 20 : భానుడి భగభగలకు ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గం టల వరకు ఎండల ధాటికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇటీవల అసాని తుఫాన్ కారణంగా వర్షాలు కురవడంతో కొంతమేర చల్లబడి ప్రజలు ఉపశ మనం పొందారు. అయితే గత మూడునాలుగు రోజుల నుంచి మళ్లీ ఎండలు విజృం భిస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో ఉన్నా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వివిధ పనులపై రోడ్లపైకి వెళ్లిన వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటు న్నారు. ఈ సందర్భంగా శీతల పానీయాల వ్యాపారం బాగా సాగుతోంది. శుక్ర వారం మాడుగులలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే మరో నాలుగైదు రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం కానుందని, అప్పుడు పరిస్థితి ఏమిటోనని అంతా ఆందోళన చెందుతున్నారు.