భారీగా కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-28T05:14:19+05:30 IST
భారీగా కరోనా కేసులు
- 189 మందికి పాజిటివ్గా నిర్ధారణ
వికారాబాద్, జనవరి 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్ జిల్లాలో కొవిడ్ కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. గురువారం జిల్లా వ్యాప్తంగా 1524 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 189మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాండూరు నియోజకవర్గం పరిధిలో 558 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 79 మందికి పాజిటివ్ వచ్చింది. తాండూరులో 313 మందికి పరీక్ష చేస్తే 67మందికి పాజిటివ్ వచ్చింది. పెద్దేముల్లో 6, బషీరాబాద్లో 3, జిన్గుర్తిలో 2, నవాల్గలో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ నియోజకవర్గంలో 208 మందికి పరీక్షలు చేయగా 32మందికి పాజిటివ్ వచ్చింది. రామయ్యగూడ, సిద్దులూరు, ఏరియా ఆసుపత్రిలో 185మందికి పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్ వచ్చినట్టు గుర్తించారు. ధారూరులో 2, నవాబ్పేట్, నాగసమందర్లలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది. పరిగి నియోజకవర్గంలో 291మందికి పరీక్షలు నిర్వహించగా 48 మందికి కరోనా సోకింది. పరిగిలో 26, దోమలో 8, కులకచర్లలో 8, పూడూరులో 6పాజిటివ్ కేసులొచ్చాయి. కొడంగల్ నియోజకవర్గంలో 216 మందికి పరీక్షలు చేయగా 26మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. బొంరా్సపేట్లో 16, అంగడి రాయిచూర్లో 5, కొడంగల్లో 4, దౌల్తాబాద్లో ఒక పాజిటివ్ కేసు నమోదైంది.