ఇసుకను వేడి చేస్తే బంగారంగా మారుతుందట!

ABN , First Publish Date - 2021-01-23T18:47:13+05:30 IST

బెంగాల్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఇసుక బంగారంగా మారుతుందని చెప్పి ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఘటన ....

ఇసుకను వేడి చేస్తే బంగారంగా మారుతుందట!

పూణే (మహారాష్ట్ర): బెంగాల్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఇసుక బంగారంగా మారుతుందని చెప్పి ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఘటన మహారాష్ట్రలోని పూణే నగరంలో వెలుగుచూసింది. పాల వ్యాపారం చేసే ఓ వ్యక్తి పూణే నగరంలోని హదాస్ పూర్ లోని ఆభరణాల వ్యాపారితో స్నేహం చేశాడు. పాలవ్యాపారి తాను బెంగాల్ నుంచి ప్రత్యేకంగా 4 కిలోల ఇసుక తీసుకవచ్చానని, దీన్ని వేడి చేస్తే బంగారంగా మారుతుందని చెప్పి నమ్మించి ఆభరణాల వ్యాపారి వద్ద నుంచి రూ.30 లక్షలరూపాయల నగదు, రూ.20లక్షల బంగారం తీసుకున్నాడు. ఆభరణాల వ్యాపారి ఇసుకను వేడి చేసి చూడగా తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పూణే పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం పాలవ్యాపారిపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-01-23T18:47:13+05:30 IST