ముంబైలో కరోనాతో మరో హెడ్ కానిస్టేబుల్ మృతి

ABN , First Publish Date - 2020-05-29T22:01:06+05:30 IST

ముంబైలో కరోనాతో మరో హెడ్ కానిస్టేబుల్ మృతి

ముంబైలో కరోనాతో మరో హెడ్ కానిస్టేబుల్ మృతి

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో కరోనా వల్ల హెడ్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పశ్చిమ ముంబైలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్ కోవిడ్-19తో శుక్రవారం చనిపోయారని అధికారులు తెలిపారు. ముంబైలో 15 మంది పోలీసులు చనిపోగా.. మహారాష్ట్రవ్యాప్తంగా 25 మంది పోలీసులు మృతి చెందినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-29T22:01:06+05:30 IST