కత్తార్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు
ABN , First Publish Date - 2021-12-27T21:52:34+05:30 IST
ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తార్ సారథ్యంలోని హర్యానా సర్కార్ మంత్రివర్గ..
చండీగఢ్: ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కత్తార్ సారథ్యంలోని హర్యానా సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఒక ట్వీట్లో తెలిపింది. మధ్యాహ్నం 4.00 గంటలకు కొత్తగా క్యాబినెట్లోకి చేరుతున్న మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని పేర్కొంది. ఇంతకుముందు 2019 నవంబర్లో మంత్రివర్గ విస్తరణను కత్తార్ చేపట్టారు. 10 మంది మంత్రులను క్యాబినెట్లోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది బీజేపీకి చెందిన వారు కాగా, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు. దీంతో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12కు చేరింది.