పీయూ వీసీగా లక్ష్మీకాంత్ రాథోడ్ ఎంపికపై హర్షం
ABN , First Publish Date - 2021-05-23T05:04:13+05:30 IST
పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా నారాయణపేట జిల్లా వాసి ఎంపికవడం పట్ల పలువురు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.
నారాయణపేట, మే 22 : పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా నారాయణపేట జిల్లా వాసి ఎంపికవడం పట్ల పలువురు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని మద్దూర్ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రాథోడ్ను పీయూ వీసీగా ప్రభుత్వం నియమిం చింది. ఈయన జిల్లా కేంద్రంలోని మార్కెట్లైన్ ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా, ఎస్ఎల్డీసీలో ఫిజికల్ డైరెక్టర్గా వి ధులు నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల బృం దం, వాలీబాల్ అసోసియేషన్, వ్యాయామ ఉపాధ్యాయ సం ఘాల నాయకులు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.