కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థిత్వంపై హర్షం
ABN , First Publish Date - 2022-05-18T05:10:59+05:30 IST
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు
- బీసీ సంఘం నాయకుల సంబురాలు
కడ్తాల్, మే 17: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు ఏపీలో వైసీసీపార్టీ రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు చేయడాన్ని హర్షిస్తూ కడ్తాల్ మండల కేంద్రంలో మంగళవారం బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. బీసీ సంఘం అధ్యక్షులు పి.వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్థానిక శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు. కృష్ణయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు. బీసీల హక్కుల సాధన, రాజ్యాధికారం కోసం 40సంవత్సరాలుగా కృష్ణయ్య చేస్తున్న కృషిని ఏపీ సీఎం జగన్ గుర్తించి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం అభినందనీయమని బీసీ సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కడ్తాల ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ, యువజన సంఘాల ఐక్యవేదిక సంఘం అధ్యక్షులు రాఘవేందర్, నాయకులు కేశమి మహేష్, మల్లే్షగౌడ్, సిద్దిగారి దాసు, సుధాకర్గౌడ్, అలీ, రవి, రాజేష్, భాను, కిరణ్, కార్తీక్గౌడ్, మహేందర్గౌడ్, రాజు, మల్లేష్, కృష్ణ, శ్రీకాంత్, మధు తదితరులు పాల్గొన్నారు.