ఆఫ్ఘన్‌ నుంచి వాళ్లని వెనక్కి తీసుకురావాలి: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-08-18T08:25:26+05:30 IST

ఆఫ్ఘనిస్తాన్ దేశం పూర్తిగా తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దేశంలో ఇతర దేశాలకు చెందిన వేలమంది ..

ఆఫ్ఘన్‌ నుంచి వాళ్లని వెనక్కి తీసుకురావాలి: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ దేశం పూర్తిగా తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దేశంలో ఇతర దేశాలకు చెందిన వేలమంది ప్రజలు తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే భారత్, అమెరికా సహా ఆయా దేశాలు ఆఫ్ఘన్‌లోని తమ ప్రజలను ప్రత్యేక విమానాలతో వెనక్కి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆఫ్ఘన్ ఎయిర్‌పోర్ట్‌లు అన్నింటినీ తాలిబన్లు మూసివేశారు. ఈ క్రమలోనే అనేకమంది భారత శిక్కులు ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ సమీపంలోని గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు.


తాజాగా వీరి గురించి బీజేపీ ఎంపీ హన్స్‌రాజ్ కేంద్ర మంత్రి హర్షదీప్ సింగ్‌ను కలిశారు. వారిని భారత్ తీసుకురావాలని కోరారు. ఈ క్రమంలోనే మంత్రి హర్షదీప్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్న శిక్కులను త్వరితగతిన భారత్‌కు తీసుకురావాలని అన్నారు. ‘ఇప్పటికే భారత అధికారులు అక్కడి శిక్కులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారు’ అని హర్షదీప్ వెల్లడించారు.

Updated Date - 2021-08-18T08:25:26+05:30 IST