మహిళపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-10-19T05:01:18+05:30 IST

మండల పరిధిలోని ముత్తవారిగూడెంలో ఓ యాభై ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. శనివారం ఈ ఘటన జరగగా, బాధితురాలి ఫిర్యాదుతో సోమవారం వెలుగులోకి వచ్చింది.

మహిళపై అత్యాచారం

శనివారం ఘటన .. ఆలస్యంగా వెలుగులోకి

పోలీసుల అదుపులో నిందితుడు.. కేసు నమోదు

దమ్మపేట, అక్టోబరు 18: మండల పరిధిలోని ముత్తవారిగూడెంలో ఓ యాభై ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. శనివారం ఈ ఘటన జరగగా, బాధితురాలి ఫిర్యాదుతో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో కూలిపనులకు వెళ్తూ జీవనోపాధి పొందుతోంది. ఒక్క కూతురు ఉండగా ఆమెకు వివాహం చేసింది. గత శనివారం అమ్మవారి ఊరేగిం పు జరుగుతుండగా రాత్రి పది గంటల సమయంలో చూసేందుకు బయటకు వచ్చింది. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన తాళ్ల నాగులు అనే వ్యక్తి సదరు మహిళను నోరు మూసి పామాయిల్‌ తోటలోకి లాక్కెల్లాడు. అత్యాచారం చేశాడు. ఆమె కేకలు వేస్తుండటంతో భయంతో పారిపోయాడు. శారీరకంగా హింసించడంతో ఆమె అనారోగ్యానికి గురయింది. ఆ రాత్రే మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లింది. ఆదివారం ఇంట్లోనే పడుకుంది. సోమవారం బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఆమె పరిస్థితిని చూసి ఆసుపత్రికి పంపించారు. అనంతరం బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-10-19T05:01:18+05:30 IST