బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని యాత్ర చేస్తున్నారు?: హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-04-17T19:30:52+05:30 IST

బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు.

బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని యాత్ర చేస్తున్నారు?: హరీష్‌రావు

హైదరాబాద్: బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని అమలవుతున్న సంక్షేమ పథకాలు.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని నిలదీశారు. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రెండు పార్టీలు తెలంగాణకు ఏం చేశాయని ప్రశ్నించారు. కేంద్రం ధరలు పెంచే ప్రభుత్వమని, టీఆర్ఎస్ పేదలకు పంచే ప్రభుత్వమని అన్నారు. కేంద్రం పేదల ఉసురు పోసుకుంటోందన్నారు. దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌గానే చూసిందని హరీష్‌రావు విమర్శించారు.

Updated Date - 2022-04-17T19:30:52+05:30 IST