ఘనంగా శ్రీకృష్ణాష్టమి

ABN , First Publish Date - 2022-08-20T05:25:43+05:30 IST

గోదావరిఖనిలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా శ్రీకృష్ణాష్టమి
‘ఖని’ వీహెచ్‌పీ కార్యాలయంలో ఉట్టి కొడుతున్న చిన్నారులు

కళ్యాణ్‌నగర్‌, ఆగస్టు 19: గోదావరిఖనిలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. శారదానగర్‌లోని విశ్వ హిందూ పరిషత్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్‌, అడిగొప్పుల రాజు ముఖ్య అతిథులుగా హాజ రై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీకృ ష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హిందూ సమా జాన్ని రక్షించుకోవడానికి, భారత దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి వేడు కలను ఘనంగా నిర్వహించుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్‌ కార్పొరేటర్‌ నగునూరి సుమలతరాజు, వీహెచ్‌పీ నగర అధ్యక్షుడు తానాజీ జాదవ్‌, ఇస్సంపల్లి వెంకన్న, నేరుకొమ్మ వెంకటస్వామి, ముష్కె సంపత్‌, బండ సమ్మన్న, మోడెం సురేందర్‌, ములుకుంట్ల శ్రీనివాస్‌, కాస సత్యనారాయణ, రాంమోహన్‌, ప్రభాత్‌, రాజేష్‌ పాల్గొన్నారు. యాదవ సం ఘం కార్యాలయంలో శ్రీకృష్ణాష్టమి ఘనంగా నిర్వహించారు. యాదవ సం ఘం నగర అధ్యక్షుడు పాతిపెల్లి రవియాదవ్‌ కృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, నాయకులు మహంకాళి స్వామి, పాతిపెల్లి ఎల్లయ్య, దీటి బాలరాజు, కౌశిక హరి, గుమ్మడి కుమారస్వామి, కాల్వ లిం గస్వామి, మెండె లింగయ్య, గుంపుల ఓదెలు, ఎంచర్ల మహేష్‌, బోయిని మల్లేష్‌, కొమ్ము చందు, గోదావరిఖని చౌరస్తాలో 50అడుగుల భారీ శ్రీకృష్ణ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated Date - 2022-08-20T05:25:43+05:30 IST