ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర

ABN , First Publish Date - 2022-05-27T05:43:53+05:30 IST

పట్టణంలోని ఆర్‌.ఎస్‌.ఎస్‌ నేతృత్వంలో హనుమాన్‌ శోభాయాత్రను హనుమాన్‌ సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర
చాట్రాయి నుంచి కమిటీ సభ్యుల శోభాయాత్ర

నూజివీడు టౌన్‌, మే 26: పట్టణంలోని ఆర్‌.ఎస్‌.ఎస్‌ నేతృత్వంలో హనుమాన్‌ శోభాయాత్రను హనుమాన్‌ సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నూజివీడు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రామిశెట్టి త్రివేణి దుర్గా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ విభాగ భౌతిక ప్రముఖ్‌ శ్రీ చక్రధారి ఆర్‌.ఎస్‌.ఎస్‌ కార్యవాహ పవన్‌ సూర్య తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

చాట్రాయి నుంచి మద్ది సన్నిధికి..

చాట్రాయి, మే 26 : చాట్రాయిలో 29 అడుగుల భారీ అభయ ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణం, ప్రతిష్ఠ దిగ్విజయంగా జరగడంతో కమిటీ సభ్యులు గురువారం మొక్కులు తీర్చుకునేందుకు గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి శోభాయాత్రగా తరలి వెళ్లారు. 2021 నవంబరు ఆరో తేదీన విగ్రహ నిర్మాణం జరగగా దాతల సహకారంతో ఈనెల 20న ప్రతిష్ఠ మహోత్సవం జరగడం భక్తుల అదృష్టమని కమిటీ సభ్యులు అన్నారు.

Updated Date - 2022-05-27T05:43:53+05:30 IST