పోగొట్టుకున్న బంగారం బాధితులకు అప్పగింత

ABN , First Publish Date - 2022-01-28T04:39:48+05:30 IST

ఏమరుపాటుతో పోగొట్టుకున్న బంగారాన్ని పోలీసులు వెతికిపట్టి బాధితురాలికి అందించారు.

పోగొట్టుకున్న బంగారం బాధితులకు అప్పగింత
బంగారాన్ని బాధితులకు అందజేస్తున్న ఎస్‌ఐ

గాలివీడు, జనవరి 27: ఏమరుపాటుతో పోగొట్టుకున్న బంగారాన్ని పోలీసులు వెతికిపట్టి బాధితురాలికి అందించారు. వివరాల్లోకి వెళితే... లక్కిరెడ్డిపల్లె మండలం మేడిమాకులగుంత గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య మూగి స్వర్ణ చిత్తూరు జిల్లాకు వెళుతూ మార్గమధ్యలో గాలివీడు మండలంలోని వెలిగల్లు ప్రాజెక్టు వద్ద సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి కలియ తిరుగుతూ తమ వద్ద ఉన్న 3 తులాల బంగారు నగలు కలిగిన బ్యాగును అక్కడే మరిచిపోయింది. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తమ సిబ్బందిని పురమాయించి ఆ బంగారాన్ని బాధితులకు అందించారు. వెంటనే స్పందించి తమ బంగారాన్ని అందించిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. 

Updated Date - 2022-01-28T04:39:48+05:30 IST