ఈ ఏడాది హంపి ఉత్సవాలు రద్దు

ABN , First Publish Date - 2021-11-06T17:30:08+05:30 IST

ఏటా విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని చాటేలా నిర్వహించే హంపి ఉత్సవాన్ని ప్రభుత్వం ఈసంవత్సరం రద్దు చేసిందని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ తెలిపారు. శుక్రవారం హొసపేటలో వారు మీడియాతో

ఈ ఏడాది హంపి ఉత్సవాలు రద్దు

                            - మంత్రి ఆనంద్‌ సింగ్‌


బళ్లారి(Karnataka): ఏటా విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని చాటేలా నిర్వహించే హంపి ఉత్సవాన్ని ప్రభుత్వం ఈసంవత్సరం రద్దు చేసిందని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ తెలిపారు. శుక్రవారం హొసపేటలో వారు మీడియాతో మాట్లాడుతూ విజయనగర జిల్లా ప్రారంభోత్సవం సందర్బంగా ప్రభుత్వం రూ.4.5 కోట్ల రుపాయల నిధులద్వారా విజయనగర ఉత్సవం చేయడంతో మరల హంపి ఉత్సవం చేయడం తగదని ఉత్సవాలను నిలిపివేశామన్నారు. రాబోవు సంవత్సరంలో దివంగత ఎంపీ ప్రకాశ్‌ ఆశయం ప్రకారం నవంబరు 3.4, 5 తేదీలలో మూడు రోజుల కాలం పాటు హంపి ఉత్సవం నిర్వహిస్తామన్నారు. హంపి  ఉత్సవానికి  ప్రభుత్వం మైసూరు దసరాకు బడ్జెట్‌లో కేటాయించిన విధంగా రూ.10కోట్లు కేటాయించాలని నవంబరు 8న జరుగు మంత్రి మండలి సమావేశంలో డిమండ్‌ చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Updated Date - 2021-11-06T17:30:08+05:30 IST