ఎన్నికలకు వెళ్లే దమ్ముందా..?
ABN , First Publish Date - 2020-08-02T13:51:04+05:30 IST
మూడు రాజధానులకు మద్దతు తెలుపుతున్న అధికారపార్టీ నేతలు..
జీవీ ఆంజనేయులు
గుంటూరు(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులకు మద్దతు తెలుపుతున్న అధికారపార్టీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. శనివారం ఆయన ఆన్లైన్ ద్వారా విలేకర్ల సమావేశం నిర్వహించారు. మూడు రాజధానుల అంశం రెఫరెండంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అంటూ గుంటూరు, కృష్ణా వైసీపీ నేతలను నిలదీశారు. సీఎం జగన్కు మద్దతు తెలుపుతూ పాలాభిషేకాలు చేయటం సిగ్గుచేటంటూ ధ్వజమెత్తారు. అమరావతికి జగన్కు సంపూర్ణ మద్దతు తెలిపిన మాట వాస్తవం కాదా అన్నారు. 30వేల మంది 34వేల ఎకరాలు త్యాగం చేయడం తప్పా అని ప్రశ్నించారు. ఏపీలో జరగుతున్న పరిణామాలను దేశమంతా గమనిస్తోందన్నారు. రాజదాని తరలింపునకు ముహూర్తాలు పెట్టుకోవంటం కోర్టు దిక్కారమేనన్నారు. రాజధాని విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయంతో ప్రజాక్షేత్రంలో భారీ మూల్యం చెల్లించుకొంటారని జీవీ హెచ్చరించారు.