ప్రజాస్వామ్యంలో ఇష్టమొచ్చినట్లు కుదరదు

ABN , First Publish Date - 2020-08-06T16:51:23+05:30 IST

ప్రజలు 151 సీట్లిచ్చారని సీఎం జగన్‌ ఇష్టమొచ్చినట్లు చేసుకుంటానంటే..

ప్రజాస్వామ్యంలో ఇష్టమొచ్చినట్లు కుదరదు

జీవీ ఆంజనేయులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ప్రజలు 151 సీట్లిచ్చారని సీఎం జగన్‌ ఇష్టమొచ్చినట్లు చేసుకుంటానంటే ప్రజాస్వామ్యంలో కుదరదని  టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. బుధవారం ఆయన ఆన్‌లైన్‌ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు సవా లుపై వైసీపీ నుంచి  స్పందన లేకపోవటం, వారిలో ఉన్న భయానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు సవాల్‌పై వెనక్కి తగ్గినట్టే మూడు రాజధానులపై కూడా వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేశారు. అమరా వతిని తరలించమని గతంలోచేసిన ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 16 నెలలుగా రాష్ట్రానికి ఏమీ చేయని ముఖ్యమంత్రి కొత్తగా విశాఖకు వెళ్లి సాధించేది ఏమీ లేదన్నారు. 


Updated Date - 2020-08-06T16:51:23+05:30 IST