రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు హేయం

ABN , First Publish Date - 2021-01-27T05:52:45+05:30 IST

రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేయడం హేయమైన చర్య అని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు హేయం

జీవీ ఆంజనేయులు 

 వినుకొండ, జనవరి 26: రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేయడం హేయమైన చర్య అని టీడీపీ నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చట్టానికి విలువలు లేకుండా పోయిందన్నారు.  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉన్మాద పాలనపై ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న వైసీపీ చర్యల వల్ల బడుగు, బలహీన వర్గాల రక్షణ కవచమైన రాజ్యాంగానికి ప్రమాదం పొంచిఉందన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను పాటించాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-01-27T05:52:45+05:30 IST