రూ.3లక్షల విలువైన గుట్కా స్వాధీనం
ABN , First Publish Date - 2022-07-03T04:45:19+05:30 IST
రెండు వేర్వే రు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి రూ.3లక్ష లు విలువైన గుట్కా సంచు లు స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డీఎ్సపీ ఎస్ఆర్ వంశీధర్ గౌడ్ తెలిపారు.
ఎనిమిది మంది నిందితుల అరెస్టు
బద్వేలు,జూలై 2: రెండు వేర్వే రు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి రూ.3లక్ష లు విలువైన గుట్కా సంచు లు స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డీఎ్సపీ ఎస్ఆర్ వంశీధర్ గౌడ్ తెలిపారు. శనివారం స్థానిక అర్బన్ పోలీసుస్టేషన్ ఆవరణలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు చెన్నంపల్లె క్రాస్ రోడ్డు, భాకరపేట వద్ద ఎనిమిది సంచుల్లో 39,200లు గుట్కా పాకెట్లను ఎగుమతి, దిగుమతి చేస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో స్థానిక రామాంజనేయనగర్ వాసి దశరథ రామారావు ప్రధాన నిందితుడు కాగా, బ్రహ్మంగారి మఠం మల్లెగుడిపాడుకు చెందిన ఉరిమి చిన్న నరసింహులు, బద్వేలులోని బసవవీధికి చెందిన సురేంద్ర, ఉరిమి చిన్న నరసింహులు, నెల్లూరు రోడ్డుకు చెందిన జి.ఓబులేసు, గద్వాల పట్టణం సుమిత్రానగర్ కు చెందిన కలిశెట్టి వెంకటసుబ్బయ్య, అగ్రహారానికి చెందిన పందీటి కేశవ, శివానగర్లోని హుసేన్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. గుట్కా పాకెట్ల విలువ రూ.3లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ వెంక టేశ్వర్లు, అర్బన్ ఎస్ఐలు శ్రీకాంత్, కత్తి వెంకటరమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.