Barkatpura: 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-27T15:53:21+05:30 IST
గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను కాచిగూడ పోలీసులు సాఽ్వధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల
హైదరాబాద్/బర్కత్పుర: గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 20 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను కాచిగూడ పోలీసులు సాఽ్వధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైస్వాల్ గార్డెన్లో నివాసం ఉంటున్న శాంతకుమార్ (35) వరుణ్ ట్రేడర్స్ పేరుతో గోదాం నడుపుతున్నాడు. గోదాంలో 20 లక్షల విలువైన 410 గుట్కా డబ్బాలను నిల్వ ఉంచాడు. సమాచారమందుకున్న కాచిగూడ పోలీసులు ఆ గోదాంపై దాడిచేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. శాంత కుమార్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.