పరీక్షల సహాయ కమిషనర్గా గురుస్వామిరెడ్డి
ABN , First Publish Date - 2022-07-02T06:20:31+05:30 IST
చిత్తూరు జిల్లా పరీక్షల సహాయ కమిషనర్గా గురుస్వామిరెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర పరీక్షల విభాగం నుంచి వచ్చిన ఆయన శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
చిత్తూరు (సెంట్రల్), జూలై 1: చిత్తూరు జిల్లా పరీక్షల సహాయ కమిషనర్గా గురుస్వామిరెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర పరీక్షల విభాగం నుంచి వచ్చిన ఆయన శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పరీక్షల సహాయ కమిషనర్గా పనిచేస్తున్న ప్రభావతి రాష్ట్ర పరీక్షల విభాగానికి బదిలీపై వెళ్లారు. కాగా 2022 టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు, మూల్యాంకనం, తుది ప్రక్రియ పూర్తయ్యే వరకు డిప్యూటేషన్పై సహాయ పరీక్షల కమిషనర్గా ప్రభావతి కొనసాగనున్నారు. బాధ్యతలు చేపట్టిన గురుస్వామిరెడ్డిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు.