Guntur: విద్యుత్ కోతలపై టీడీపీ పోరుబాట
ABN , First Publish Date - 2021-10-19T16:57:20+05:30 IST
జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో విద్యుత్ కోతలపై టీడీపీ పోరు బాట పట్టింది. మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు దిగారు.
గుంటూరు: జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో విద్యుత్ కోతలపై టీడీపీ పోరు బాట పట్టింది. మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు దిగారు. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. సబ్ స్టేషన్కు ఊరి తాళ్లు బిగించుకోని రైతుల నిరసన ప్రదర్శనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, విద్యుత్ కోతలను ఎత్తువేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.