గుంటూరులో స్కూల్ విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-02-27T18:15:44+05:30 IST

జిల్లాలోని చేబ్రోలు మండలం శేకూరు లో స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందుగా వెళ్తున్న మట్టి లారీల నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరులో స్కూల్ విద్యార్థుల ఆందోళన

గుంటూరు: జిల్లాలోని చేబ్రోలు మండలం శేకూరు లో స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందుగా వెళ్తున్న మట్టి లారీల నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ముందు గ్రామంలో వెళ్తున్న వందలాది లారీలు నిలిచిపోయాయి. లారీలు విచ్చలవిడిగా తిరగడంతో పలు సార్లు ప్రమాదాలు జరిగాయని విద్యార్థులు చెబుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి లారీలను పంపివేశారు. విద్యార్థుల నిరసనకు గ్రామస్తులు మద్దతు తెలిపారు. మట్టి లారీలతో తమ పంట పోలాలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారలకు ఎన్ని సార్లు చెప్పిన ఫలితం లేదని మండిపడ్డారు. మైనింగ్ మాఫీయాపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-02-27T18:15:44+05:30 IST