గుంటూరు: డిజిటల్ అసిస్టెంట్పై వాలంటీర్ దాడి
ABN , First Publish Date - 2020-10-20T17:53:06+05:30 IST
జిల్లాలోని అమరావతి మండలం యండ్రాయి గ్రామ సచివాలయంలో ఘర్షణ చోటు చేసుకుంది. డిజిటల్ అసిస్టెంట్ మీద వాలంటీర్ చిలకా వినోద్ కుమార్ దాడి చేశాడు.
గుంటూరు: జిల్లాలోని అమరావతి మండలం యండ్రాయి గ్రామ సచివాలయంలో ఘర్షణ చోటు చేసుకుంది. డిజిటల్ అసిస్టెంట్ మీద వాలంటీర్ చిలకా వినోద్ కుమార్ దాడి చేశాడు. రేషన్ కార్డులు ఈకేవైసీ చేయించటం ఆలస్యంపై వాలంటీర్ను పిలిచి మాట్లాడుతుండగా వాగ్వివాదం చోటు చేసుకుంది. మాట్లాడుతుండగానే గ్రామ సచివాలయ సిబ్బందిపై వాలంటీర్ దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో సచివాలయంలోనే ఇరు వర్గాలు కొట్లాటకు దిగాయి.