గుంటూరు జిల్లా: నరసరావుపేట మండలం, కేసానుపల్లిలో టీడీపీ ఫ్లెక్సీలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను పరిశీలించి వైసీపీ దుర్మార్గాలపై మండిపడ్డారు. ఫ్లెక్సీలను తగలబెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.