గుంటూరు జిల్లా: మూగజీవిని బలికొన్న అతివేగం..

ABN , First Publish Date - 2022-01-11T16:46:48+05:30 IST

గుంటూరు జిల్లా: అతివేగం ఓ మూగజీవి ప్రాణం తీసింది. వేగంగా వస్తున్న లారీ ఎద్దుల బండిని ఢీ కొట్టింది.

గుంటూరు జిల్లా: మూగజీవిని బలికొన్న అతివేగం..

గుంటూరు జిల్లా: అతివేగం ఓ మూగజీవి ప్రాణం తీసింది. వేగంగా వస్తున్న డీసీఎం లారీ ఎద్దుల బండిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ ఎద్దు గిల గిల కొట్టుకొంటూ ప్రాణం విడిచింది. ఈ ఘటన గుంటూరు జిల్లా, కొల్లిపొర మండలం, చిలవలూరు గ్రామ శివారు పరిధిలో చోటు చేసుకుంది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తమ ఎద్దు మృత్యువాత పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుటుంబం  ఎద్దుల బండిమీదే ఆధారపడి జీవిస్తోందని, అందులో ఒక ఎద్దు మృత్యువాత పడడంతో.. ఇప్పుడు మరో ఎద్దును కొనే స్తోమత లేదని యజమాని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. 

Updated Date - 2022-01-11T16:46:48+05:30 IST