గుంటూరులో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌పై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-27T16:01:49+05:30 IST

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఎమ్మెల్సీ అభ్యర్థి రామకృష్ణ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు.

గుంటూరులో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌పై ఫిర్యాదు

గుంటూరు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఎమ్మెల్సీ అభ్యర్థి రామకృష్ణ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రతాప్‌ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ట్రైనింగ్‌ల పేరుతో ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రతాప్ రెడ్డి భార్య కల్పలతా రెడ్డి పోటీ చేశారు. ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి మన్నవ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-02-27T16:01:49+05:30 IST