ఉద్దండరాయునిపాలెంకు అమరావతి జేఏసీ పాదయాత్ర
ABN , First Publish Date - 2020-10-22T14:26:27+05:30 IST
అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
గుంటూరు: అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. గుంటూరు నుంచి ఉద్దండరాయుని పాలెంలోని శంకుస్థాపన స్థలం వరకు యాత్ర సాగనుంది. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ కలుగజేసుకోవాలని నినాదాలు చేశారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.