నైజీరియా బార్లో గన్మెన్ కాల్పులు...10 మంది మృతి
ABN , First Publish Date - 2021-06-15T12:10:22+05:30 IST
నైజీరియా దేశంలోని ఓ బార్లో గన్మెన్ జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి ....
అబుజా (నైజీరియా): నైజీరియా దేశంలోని ఓ బార్లో గన్మెన్ జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. వ్యానులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో జోస్ సౌత్ లోని బార్ లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 10 మంది మరణించారని నైజీరియా పోలీసు ప్రతినిధి ఉబాఒగాబా చెప్పారు. బార్ లో కాల్పులు జరిపిన గన్మెన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు సాగిస్తున్నారు. బార్ లో కాల్పుల ఘటన నైజీరియాలో సంచలనం రేపింది.