గుజరాత్ లో పెరుగుతున్న కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-08-07T02:12:02+05:30 IST

గుజరాత్ లో పెరుగుతున్న కరోనా మరణాలు

గుజరాత్ లో పెరుగుతున్న కరోనా మరణాలు

గాంధీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ గుజరాత్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులతోపాటు కోవిడ్-19 మరణాలు పెరిగిపోతున్నాయి. గురువారం రోజు కొత్తగా గుజరాత్ రాష్ట్రంలో 1,034 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67,811 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ఇవాళ 27 మంది మృతి చెందగా, మొత్తం 2,584 చనిపోయారు. ప్రస్తుతం 14,905 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు చెప్పారు. కరోనా నుంచి కోలుకొని 50,322 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది.


Updated Date - 2020-08-07T02:12:02+05:30 IST