గుజరాత్‌లో మరో 67 మందికి కరోనా.. 308కి చేరిన కేసులు..

ABN , First Publish Date - 2020-04-10T18:16:47+05:30 IST

ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 గుజరాత్‌లో మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 67 మంది..

గుజరాత్‌లో మరో 67 మందికి కరోనా.. 308కి చేరిన కేసులు..

గాంధీ నగర్: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 గుజరాత్‌లో మరింత విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 67 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య 308కి చేరినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయంతి రవి వెల్లడించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందనీ.. వారికి వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నామని ఆమె తెలిపారు. ‘‘గత 24 గంటల్లో మేము 978 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 67 మందికి పాజిటివ్ అని తేలింది...’’ అని జయంతి రవి పేర్కొన్నారు.


కాగా దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇవాళ 6,412కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 12 గంటల్లోనే 547 మంది కరోనా బారిన పడినట్టు గుర్తించామని తెలిపింది. కరోనా కారణంగా ప్రస్తుతం 5709 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 504 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని కేంద్రం పేర్కొంది. కాగా గత 12 గంటల్లో 30 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కొవిడ్-19 మృతుల సంఖ్య 199కి చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2020-04-10T18:16:47+05:30 IST