ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN , First Publish Date - 2022-01-20T01:45:57+05:30 IST
మండలంలోని గుడినరవ రైతు భరోసా కేంద్రంలో బుధవారం మండల వ్యవసాయాధికారి పీ.చెన్నారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఉదయగిరి రూరల్, జనవరి 19: మండలంలోని గుడినరవ రైతు భరోసా కేంద్రంలో బుధవారం మండల వ్యవసాయాధికారి పీ.చెన్నారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడ్-ఏ రకం క్వింటా రూ.1960, గ్రేడ్-బీ రూ.1940 మద్దతు ధరతో కొనుగోలు చేస్తారన్నారు. ధాన్యంలో 17 శాతంలోపు మాత్రమే తేమ ఉండాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో భోగ్యం సుధీర్కుమార్, సొసైటీ సీఈవో పోలయ్య, వీఏఏ రహంతుల్లా, రైతులు తదితరులు పాల్గొన్నారు.