ప్రభువును నమ్మిన వారికి మేలు

ABN , First Publish Date - 2021-03-07T05:50:13+05:30 IST

ప్రభువును నమ్మి ప్రార్థించే వారికి మేలు జరుగుతుందని హోసన్నా మందిర పాస్టర్‌ అబ్రహాం అన్నారు.

ప్రభువును నమ్మిన వారికి మేలు
ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులు

పాస్టర్‌ అబ్రహాం

నేటితో ముగియనున్న గుడారాల పండుగ   

గుంటూరు(సంగడిగుంట), మార్చి 6: ప్రభువును నమ్మి ప్రార్థించే వారికి మేలు జరుగుతుందని హోసన్నా మందిర పాస్టర్‌ అబ్రహాం అన్నారు. గుడారాల పండుగ మూడోరోజు శనివారం ఆయన సందేశమిస్తూ..  దేవుని చిత్తము నెరవేర్చేందుకు భక్తులు నడవాలన్నారు. పాస్టర్‌ రమేష్‌ ప్రసంగిస్తూ క్రీస్తు కొరకు శ్రమ పడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు.  ఉదయం జరిగిన ప్రార్థనల్లో పాస్టర్‌ ఏసుదాసు స్తుతి గీతాలు ఆలపించారు. పాస్టర్‌ అనిల్‌ తన సందేశంలో దేవుడు తన వెంట నడిచిన వారికి జయము కలుగజేస్తాడన్నారు. పాస్టర్‌ జాన్‌ వెస్లీ మాట్లాడుతూ దేవుడు బానిసత్వం నుంచి విడిపిస్తాడని తెలిపారు. పాస్టర్‌ మదనపల్లి రాజశేఖర్‌ ప్రసంగించారు. హోంమంత్రి సుచరిత పాస్టర్ల ఆశీస్సులు పొందారు. ఆదివారం మధ్యాహ్నం ప్రార్థనలతో గుడారాల పండుగ ముగియనుంది. 

Updated Date - 2021-03-07T05:50:13+05:30 IST