చేనేతపై జీఎస్టీని ఎత్తేయాలి

ABN , First Publish Date - 2022-01-29T06:14:24+05:30 IST

చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ డిమాండ్‌ చేశారు. చేనేతకు జీరో జీఎస్టీ అమలుకోసం అఖిల భారత పద్మశాలి సంఘం పిలుపు మేరకు ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు లక్ష పోస్టుకార్డుల ఉద్యమా న్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.

చేనేతపై జీఎస్టీని ఎత్తేయాలి
పోచంపల్లి సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎల్‌.రమణ

ఎమ్మెల్సీ ఎల్‌.రమణ


భూదాన్‌పోచంపల్లి, జనవరి 28: చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ డిమాండ్‌ చేశారు. చేనేతకు జీరో జీఎస్టీ అమలుకోసం అఖిల భారత పద్మశాలి సంఘం పిలుపు మేరకు ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు లక్ష పోస్టుకార్డుల ఉద్యమా న్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చేనేతపై జీరో జీఎస్టీ కోసం చేపట్టిన ఉద్య మం ఆరంభం మాత్రమేనని, ఇది అంతం కాదన్నారు. చేనేత రంగ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలను కలిసి మద్దతు కూడగట్టి, ఢిల్లీలో ఉద్యమిస్తామన్నారు. అఖిల పక్షం చేనేత నా యకులు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. ముందుగా ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ అధ్యక్షుడు తడక రమేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, పలు చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T06:14:24+05:30 IST