వలస కూలీకి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-02-25T05:47:36+05:30 IST

పొట్ట చేతపట్టుకుని వలస వెళ్తూ గుంటూరు జిల్లా వినుకొండ వద్ద ప్రమాదంలో మృతి చెందిన భీముడు, డ్రైవర్‌ దస్తగిరి మృతదేహాలకు బుధవారం అంత్యక్రియలు జరిగాయి.

వలస కూలీకి అంత్యక్రియలు


   ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 24:
పొట్ట చేతపట్టుకుని వలస వెళ్తూ గుంటూరు జిల్లా వినుకొండ వద్ద ప్రమాదంలో మృతి చెందిన భీముడు,  డ్రైవర్‌ దస్తగిరి మృతదేహాలకు బుధవారం అంత్యక్రియలు జరిగాయి. మాస్మాన్‌ దొడ్డికి చెందిన భీముడు, పార్లపల్లికి చెందిన దస్తగిరి అలియాస్‌ ఉమేష్‌కుమార్‌ మృతదేహాలకు వారి స్వగ్రామాల్లో   బంధువులు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.   దస్తగిరి కుటుంబ సభ్యులకు సచివాలయ ఉద్యోగులు లింగన్న, ఊర్మిళ, జయప్రతాప్‌ వైఎసార్‌ బీమా పరిహారం రూ.10వేలు అందజేశారు. మాస్మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన భీముడు కుటుంబ సభ్యులకు కందనాతికి చెందిన గోవర్ఱన్‌ రెడ్డి, కేశన్న, మాస్మాన్‌దొడ్డికి చెందిన హానుమంతు రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు.    

Updated Date - 2021-02-25T05:47:36+05:30 IST