నాకీ పెళ్లి వద్దంటూ పీటల పైనుంచే లేచి వెళ్లిపోయిన వరుడు.. అసలు కారణం తెలిసి నివ్వెరపోయిన బంధువులు..!

ABN , First Publish Date - 2022-06-23T02:00:54+05:30 IST

పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది.. వధూవరులు పీటల మీద కూర్చున్నారు..

నాకీ పెళ్లి వద్దంటూ పీటల పైనుంచే లేచి వెళ్లిపోయిన వరుడు.. అసలు కారణం తెలిసి నివ్వెరపోయిన బంధువులు..!

పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది.. వధూవరులు పీటల మీద కూర్చున్నారు.. మేళతాళాలు మోగుతున్నాయి.. ఇక తాళి కట్టడమే తరువాయి అనే సమయంలో తనకీ పెళ్లి వద్దంటూ వరుడు పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయాడు.. బ్యాండ్ వాళ్లకు డబ్బులు ఎవరు చెల్లించాలనే విషయం మీద వివాదం రేగడంతో ఆగ్రహానికి గురైన వరుడు పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయాడు. 


ఇది కూడా చదవండి..

13 నెలల క్రితమే పెళ్లి.. నిద్రమాత్రలు ఇచ్చి భర్త మర్మాంగాన్ని కోసిన భార్య.. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే దారుణం


ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్ పూర్‌కు చెందిన వరుడు మంగళవారం సాయంత్రం బ్యాండు బాజాలతో పెళ్లి వేడుకకు చేరుకున్నాడు. అనంతరం పీటల మీద కూర్చుని పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించాడు. పెళ్లి తంతు జరుగుతున్న సమయంలో బ్యాండు వాళ్లు వచ్చి వరుడి తల్లిదండ్రులను డబ్బులు అడిగారు. ఆ డబ్బులు వధువు తల్లిదండ్రులు ఇస్తారని వరుడి తరఫు వారు చెప్పారు. అయితే బ్యాండు వారికి డబ్బులు ఇచ్చేందుకు వధువు తరఫు వారు నిరాకరించారు. 


దీంతో ఆ డబ్బుల విషయమై ఇరు వర్గాల మధ్య వాదన మొదలైంది. ఆ విషయం తెలుసుకున్న వరుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వధువు తరఫు వారు తనను అవమానించినట్టుగా భావించాడు. మెడలో దండలు తీసేసి పెళ్లి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇరు వర్గాల వారు సైలెంట్‌గా కళ్యాణ మండపం నుంచి విడివిడిగా వెళ్లిపోయారు. 

Updated Date - 2022-06-23T02:00:54+05:30 IST