6 రోజుల్లో పెళ్లనగా సగం కాలిపోయిన స్థితిలో వరుడి మృతదేహం.. కారణమెవరో తెలిసి నివ్వెరపోయిన బంధువులు..!
ABN , First Publish Date - 2022-05-19T21:48:54+05:30 IST
ఆ యువకుడికి వివాహం నిశ్చయమైంది.. ఆరు రోజుల్లో పెళ్లనగా ఆ యువకుడు అదృశ్యమయ్యాడు..
ఆ యువకుడికి వివాహం నిశ్చయమైంది.. ఆరు రోజుల్లో పెళ్లనగా ఆ యువకుడు అదృశ్యమయ్యాడు.. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ దొరకలేదు.. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రెండ్రోజుల తర్వాత ఆ యువకుడి మృతదేహం గుర్తు పట్టలేని స్థితిలో లభ్యమైంది.. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితులను కనిపెట్టారు.. వధువు ప్రేమికుడు ఈ పని చేసినట్టు తేలింది.. దీంతో అతడిని, అతడికి సహకరించిన స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..
55 ఏళ్ల వ్యక్తి దారుణ హత్య.. 19 ఏళ్ల కుర్రాడి పనేనని తేల్చిన పోలీసులు.. విచారణలో వీళ్ల గురించి అసలు నిజం తెలిసి..
ఛత్తీస్గఢ్లోని లోర్మికి చెందిన దీపక్ ధులియా అనే యువకుడికి ఈ నెల 20న వివాహం నిశ్చయమైంది. పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో ఈ నెల పదో తేదీన దీపక్ హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ దొరకలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల అనంతరం అఘారియా డ్యామ్ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ మృతదేహం దీపక్దేనని అతని కుటుంబ సభ్యులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
దీపక్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ప్రేమికుడు రింకూ, అతని స్నేహితుడు హీరాలాల్ను పోలీసులు నిందితులుగా గుర్తించారు. పెళ్లికి కావాల్సిన డబ్బులు అప్పు ఇస్తామని చెప్పి వారు దీపక్ను డ్యామ్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ దీపక్కు బాగా మద్యం పట్టించిన అనంతరం ఓ పెద్ద బండరాయితో అతడి తలను నుజ్జు నుజ్జు చేశారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఫోన్ కాల్స్, లొకేషన్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.