హరితహారాన్ని విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-07-02T07:00:15+05:30 IST
హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత అన్నారు.
పెంబి, జూలై 1 : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత అన్నారు. శుక్రవారం మండలం లోని లోతర్య తండా, పెంబి గ్రామంలో పర్య టించి నర్సరీలు, క్రీడాప్రాంగణాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఖాళీ స్థలా లను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలన్నారు. లోతర్య తండా శ్మశాన వాటిక బిల్లు చెల్లింపులో జాప్యం జరిగిందని పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఆ గ్రామంలో డీపీవో విచారణ చేపట్టారు. ఎంపీవో ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పెంబిలో క్రీడా ప్రాంగణం సక్రమంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో చిక్యాల రత్నాకర్రావు, సర్పంచ్ శాంకీబాయి, పంచాయతీ కార్యదర్శి భీంరావు, నాయకులు బానావత్ విలాస్, తదితరులు పాల్గొన్నారు.