పచ్చదనాన్ని పెంచేందుకే హరితహారం

ABN , First Publish Date - 2022-08-19T05:43:15+05:30 IST

పచ్చదనాన్ని పెంచేందుకే హరితహారం

పచ్చదనాన్ని పెంచేందుకే హరితహారం
మొక్కలు నాటుతున్న మంత్రులు

మొయినాబాద్‌ ఆగస్టు 18: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకే హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖమంత్రి సబితారెడ్డి, ఎంపీ సంతో్‌షకుమార్‌ అన్నారు. మొయినాబాద్‌లోని చిలుకూరు రెవెన్యూలో మృగవణి ఫారెస్డుకు సంబంధించిన అటవీ ప్రాంతంలో  గురువారం గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఓటీవీ ఛానల్‌ (ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కాదు) ఆధ్యర్యంలో సీడ్‌బాల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా  అటవీ ప్రాంతంలో డ్రోన్‌ సాయంతో సీడ్‌ బాల్స్‌ వేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎ్‌సరత్నం, ఎంపీపీ నక్షత్రం జైవంత్‌, జడ్పీటీసీ శ్రీకాంత్‌, సర్పంచ్‌ స్వరూప, ఎంపీడీవో సంధ్య, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నాయకులు అనంతరెడ్డి ఉన్నారు. 

Updated Date - 2022-08-19T05:43:15+05:30 IST