డయాలసిస్ కేంద్రాలు మంజూరు
ABN , First Publish Date - 2022-05-25T05:45:29+05:30 IST
డయాలసిస్ కేంద్రాలు మంజూరు
చేవెళ్ల/ఆమనగల్లు, మే 24: చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం మంజూరైనట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు హరీశ్రావుకు, సబితారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చేవెళ్లలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ డయాలసిస్ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నియోజకవర్గంలోని కల్వకుర్తి, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, వెల్ధాదండ, మాడ్గుల మండలాల ప్రజల సౌకర్యార్థం రాష్ట్రప్రభుత్వ డయాలసిస్ కేంద్రం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ తెలిపారు. కల్వకుర్తి ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్సెంటర్కు డయాలసిస్ కేంద్రం మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్యవిదాన పరిషత్ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వన్ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టణంలో మంగళవారం జైపాల్యాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ కల్వకురి ్తనియోజకవర్గానికి డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్రవైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావును తాను ఇటీవల కలిసి విన్నవించినట్లు తెలిపారు. ఈమేరకు డయాలసిస్ కేంద్రం మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రీ హరీ్షరావుకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.