తాతపై కత్తితో మనుమడి దాడి
ABN , First Publish Date - 2022-05-28T06:01:51+05:30 IST
ఆస్తికోసం తాతపై మనుమడు దాడిచేసిన ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపహాడ్ గ్రామంలో శుక్రవారం జరిగింది.
శాలిగౌరారం, మే 27: ఆస్తికోసం తాతపై మనుమడు దాడిచేసిన ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపహాడ్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోలుకొండ బక్కయ్య తన రెండో కుమారుడు అయోధ్యతో కలిసి ఇంటి గోడ కూలగొడుతుండగా అయోధ్య కుమారుడు రాంచరణ్ కూలగొట్టవద్దని చెప్పాడు. ఇదేక్రమంలో తండ్రీ కొడుకులైన అయోధ్య, రాంచరణ్లు గొడవకు దిగారు. రాంచరణ్ తండ్రిపై కత్తితో దాడి చేస్తుండగా అడ్డుగా వచ్చిన తాతపై దాడిచేసి గాయపరిచాడు. తీవ్రగాయాలైన బక్కయ్యను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బక్కయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.