ఘనంగా బుద్ధుడి విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-08-19T06:11:38+05:30 IST

జడ్పీ హైస్కూల్లో బుద్ధ వనంలో దాతల విరాళాలు రూ.25 వేలతో ఏర్పాటు చేసిన గౌతమబుద్ధుడి విగ్రహాన్ని బుద్ధిస్టు సొసైటీ ప్రతినిధులు కమలారాణి, రాహుల్‌ బుద్ధ గురువారం ఆవిష్కరించారు.

ఘనంగా బుద్ధుడి విగ్రహావిష్కరణ
విగ్రహావిష్కరణలో బుద్ధిస్టు సొసైటీ ప్రతినిధులు

గంపలగూడెం, ఆగస్టు 18: జడ్పీ హైస్కూల్లో బుద్ధ వనంలో దాతల విరాళాలు రూ.25 వేలతో ఏర్పాటు చేసిన గౌతమబుద్ధుడి విగ్రహాన్ని బుద్ధిస్టు సొసైటీ ప్రతినిధులు కమలారాణి, రాహుల్‌ బుద్ధ గురువారం ఆవిష్కరించారు. బుద్ధవనం, తోటమూల హిమాలయ ఆశ్రమంలో మొక్కలు నాటారు.  టీడీపీ నాయకుడు వై.పుల్లయ్య చౌదరి, హిమాలయ ఆశ్రమ నిర్వహకుడు కుందా కోటేశ్వరరావు, వైసీపీ నాయకులు రామిశెట్టి శ్రీరామ్‌మూర్తి, కొత్తగుండ్ల నరసింహారావు, అంబేద్కర్‌ ట్రస్టు ప్రతినిధి కొంగల ప్రసాద్‌, ఎ.కొండూరు మాజీ సర్పంచ్‌ నాగపద్మ, హైస్కూల్‌ హెచ్‌.ఎం సంగెపు జమలయ్య, తిరువూరు బుద్ధిస్టు సొసైటీ ప్రతినిధి చింతా అప్పారావు, దుబ్బాకు ట్రస్టు ప్రతినిధి దుబ్బాకు వెంకటేశ్వరరావుపాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T06:11:38+05:30 IST