సచివాలయ భవనాలకు తెల్లరంగు

ABN , First Publish Date - 2020-06-06T16:50:20+05:30 IST

జిల్లాలోని సచివాలయ భవనాలకు వైసీపీ రంగులను తొలగించి తెల్లరంగు వేయాలని..

సచివాలయ భవనాలకు తెల్లరంగు

వైసీపీ రంగులను తొలగించమని ఎంపీడీవోలకు మౌఖిక ఆదేశాలు


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సచివాలయ భవనాలకు వైసీపీ రంగులను తొలగించి తెల్లరంగు వేయాలని మండలాలకు ఆదేశాలు అందాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వార్డు, గ్రామ సచివాలయాలను వైసీపీ రంగులతో అలంకరించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఈ రంగులను తొలగించాలని తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. వెంటనే రంగులను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో జిల్లాలోని 1035 గ్రామ సచివాలయ భవనాలకు తెల్లరంగు వేయాలని జిల్లా కేంద్రం నుంచి ఎంపీడీవోలకు శుక్రవారం ఆదేశాలందాయి. అయితే 277 వార్డు సచివాలయ భవనాలకు రంగుల మార్పు గురించి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఇప్పటివరకు మౌఖిక ఆదేశాలు మాత్రమే అందాయని, వారం రోజుల్లోగా అన్ని సచివాలయాలకు రంగు మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఒక ఎంపీడీవో తెలిపారు.

Updated Date - 2020-06-06T16:50:20+05:30 IST