రేపు పంచాయతీల్లో గ్రామ సభలు
ABN , First Publish Date - 2021-04-13T05:49:36+05:30 IST
జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు డీపీవో దశరథరామిరెడ్డి తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 12: జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు డీపీవో దశరథరామిరెడ్డి తెలిపారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ, తిరుపతి ఉప ఎన్నికల కోడ్కు అనుగుణంగా ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామసభలు నిర్వహించాలని డీపీవో సూచించారు.