ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-06-13T06:10:00+05:30 IST
మండలంలోని జాంలో కొనుగోలు చేస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రంను శనివారం కలెక్టర్ ముషారఫ్ పారూఖీ అలీ పరిశీలించారు.
సారంగాపూర్, జూన్ 12 : మండలంలోని జాంలో కొనుగోలు చేస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రంను శనివారం కలెక్టర్ ముషారఫ్ పారూఖీ అలీ పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, దీంతో కొనుగోలు పూర్తయినందుకు కొనుగోళ్ల కేంద్రాల నిర్వాహకులను, అధికారులను అభినందించారు. ఈయన వెంట తహసీల్దార్ తుకారాం, సంబంధిత అధికారులు, రైతులు ఉన్నారు.
లక్ష్మణచాందలో పర్యటన
లక్ష్మణచాంద, జూన్ 12 : నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ శనివారం మండలంలో పర్యటించారు. బోరిగాం గ్రామంలో గోదాంల నిర్మాణం కోసం సర్వే నెంబర్ 204లో గల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కవితా రెడ్డి, సర్వేయర్ యోహన్లు ఉన్నారు.