పట్టభద్రులారా ఒకసారి ఆలోచించండి
ABN , First Publish Date - 2022-08-19T05:07:08+05:30 IST
‘పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించండి.. రాష్ట్రం లో మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కసారి పరిశీలించి ఓటు ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని’ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి కోరారు.
టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి
వెలిగండ్ల, ఆగస్టు 18 : ‘పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించండి.. రాష్ట్రం లో మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కసారి పరిశీలించి ఓటు ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని’ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి కోరారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో కార్యకర్తలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ బలపరిచిన రాయలసీమ(ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు) గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ను పట్టభద్రులు గెలిపించుకోవాలని కోరారు. వైసీపీ అస్తవ్యస్త విధానాలకు వ్యతిరేకంగా పోరాడేది ఒక్క టీడీపీ మాత్రమేనన్న విషయాన్ని పట్టభద్రులు గుర్తుంచుకోవాలని సూచించారు. సెబ్ కేసులో ఉన్న వ్యక్తిని వైసీపీ బలపరిచింది అంటే వైసీపీ తీరును అర్థం చేసుకోవాలన్నారు. పట్టభద్రులు అందరూ ఓటును కొత్తగా నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకట రెడ్డి, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు కేలం ఇంద్ర భూపాల్ రెడ్డి, కనిగిరి రూరల్ మండల కన్వీనర్ పిచ్చలా శీనివాస్ రెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కసునూరి మౌలాలి, జి. సుబ్రమణ్యం, కొండూ శీను, పండూ, నారాయణ, శీను మాలకొండయ్య కార్యకర్తలు పాల్గొన్నారు