గాయపడిన కర్ణాటక విద్యార్థి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాం: సీఎం
ABN , First Publish Date - 2022-03-02T19:46:00+05:30 IST
ఉక్రయిన్లోని ఖార్కివ్ సిటీపై రష్యా బలగాలు జరుపుతున్న దాడిలో గాయపడిన హవేరి జిల్లా విద్యార్థి ఆచూకీ..
బెంగళూరు: ఉక్రయిన్లోని ఖార్కివ్ సిటీపై రష్యా బలగాలు జరుపుతున్న దాడిలో గాయపడిన హవేరి జిల్లా విద్యార్థి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారంనాడు తెలిపారు. ఖార్కివ్ నగరంపై మంగళవారం రష్యా సైనం జరిపిన క్షిపణి దాడిలో 22 ఏళ్ల శేఖరప్ప గ్యానగౌడర్ నవీన్ ప్రాణాలు కోల్పోవడం ఇప్పటికే కర్ణాటకలో విషాదం నిపింది. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి మొదలు పెట్టినప్పటి నుంచి అక్కడి భారతీయులు మరణించడం తొలిసారి. కాగా, ఇదే దాడిలో హవరే జిల్లా విద్యార్థి గాయపడిన విషయంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. అతను సురక్షితంగానే ఉన్నట్టు ఒక సమాచారం ఉండగా, గాయపడినట్టు మరో సమాచారం ఉందని, ధ్రువీకరణ కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.