ప్రభుత్వ బోర్డుతో అక్రమ రవాణా

ABN , First Publish Date - 2020-03-25T13:12:35+05:30 IST

పౌర సరఫరాల సంస్థ పేర బియ్యం సరఫరా చేస్తున్నట్లు లారీకి బోర్డు పెట్టి.. ఇనుప పైపుల తయారీకి ముడిసరుకును తీసుకెళ్తున్న లారీని గ్రామస్థులు పట్టుకుని నిలిపేశారు. చెట్లగౌరారం గ్రామ శివారులో సర్పంచ్‌ నర్సయ్య,

ప్రభుత్వ బోర్డుతో అక్రమ రవాణా

మనోహరాబాద్‌, మార్చి 24 : పౌర సరఫరాల సంస్థ పేర బియ్యం సరఫరా చేస్తున్నట్లు లారీకి బోర్డు పెట్టి.. ఇనుప పైపుల తయారీకి ముడిసరుకును తీసుకెళ్తున్న లారీని గ్రామస్థులు పట్టుకుని నిలిపేశారు. చెట్లగౌరారం గ్రామ శివారులో సర్పంచ్‌ నర్సయ్య, ఉపసర్పంచ్‌ శ్రీహరిగౌడ్‌ ఆధ్వర్యంలో కంచెలను ఏర్పాటు చేస్తుండగా.. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ బోర్డు వేసుకుని లారీ వచ్చింది. అనుమానం వచ్చిన గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు లారీని ఆపి చూడగా.. ఇనుము తయారీ ముడి సరుకు ఉండడంతో అధికారులకు సమాచారం అందజేసి గ్రామ శివారులోనే నిలిపేశారు.

Updated Date - 2020-03-25T13:12:35+05:30 IST