తమిళనాడు గవర్నర్ పురోహిత్‌కు కరోనా నెగిటివ్

ABN , First Publish Date - 2020-08-15T12:45:58+05:30 IST

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా బారి నుంచి కోలుకున్నారు....

తమిళనాడు గవర్నర్ పురోహిత్‌కు కరోనా నెగిటివ్

చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా బారి నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి గవర్నర్ పురోహిత్ కు జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. గవర్నర్ పురోహిత్ ధైర్యం, సంకల్పం వల్ల కరోనా నుంచి త్వరగా కోలుకున్నారని చెన్నైలోని కావేరి ఆసుపత్రి వైద్యులు చెప్పారు. గవర్నర్ పురోహిత్ కరోనా నుంచి కోలుకొని చురుకుగా ఉన్నారని వైద్యులు చెప్పారు.గతంలో పురోహిత్ కు కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లోనే ఉంచి కావేరీ హాస్పిటల్ వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. దాదాపు రెండు వారాల క్రితం నుంచే తమిళనాడు గవర్నర్ ఐసోలేషన్‌లో ఉన్నారు. గవర్నర్ ఇంటి వద్ద ప్రతీ రోజు డిస్‌ఇన్‌ఫెక్షన్ డ్రైవ్ కూడా చేపట్టారు. తమిళనాడులో ఇప్పటికే ముగ్గురు మంత్రులు కరోనా బారిన పడి, కోలుకున్నారు. 

Updated Date - 2020-08-15T12:45:58+05:30 IST