అభివృద్ధిలో విఫలమైన ప్రభుత్వాలు: వీహెచ్‌

ABN , First Publish Date - 2021-01-27T05:17:45+05:30 IST

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు.

అభివృద్ధిలో విఫలమైన ప్రభుత్వాలు: వీహెచ్‌
సంతోష్‌బాబు తల్లిదండ్రులకు నమస్కరిస్తున్న హన్మంతరావు

 సూర్యాపేటటౌన్‌, జనవరి 26 : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. జిల్లా కేం ద్రంలోని రెడ్‌హౌజ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశచరిత్రలోనే ఎన్నడూలేని విధంగా రైతులు రెండు నెలలుగా ధర్నాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యమాలను నిర్వీర్యం చేసేలా చర్చలపేరుతో కాలయాపన చేస్తోందన్నారు. వ్యవసాయ చట్టాలపై సీఎం కేసీఆర్‌ తీరు సిగ్గుచేటన్నారు. కల్నల్‌ సంతో్‌షబాబు జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం కల్నల్‌ సంతో్‌షబాబు నివాసంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సంతో్‌షబాబు తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అంజద్‌అలీ, నాయకులు శేఖర్‌, పందిరి వెంకన్న, రాంబాబు, అవినాష్‌, లక్ష్మణ్‌యాదవ్‌, అభిషేక్‌ పాల్గొన్నారు. 

నడిగూడెం : నడిగూడెం, జనవరి 26 : భారతదేశ చరిత్రలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఘనత కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని జగన్‌ ప్రభుత్వాలకే దక్కిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. నడిగూడెంలో రాజావారికోటలో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు.  జాతీయగీతం, జెండాలకు వందేళ్ల ఉత్సవాలను నిర్వహించాలని కోరుతూ ప్లేకార్డులు, ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు. 

Updated Date - 2021-01-27T05:17:45+05:30 IST