దరల అదుపులో ప్రభుత్వాలు విఫలం
ABN , First Publish Date - 2021-06-22T06:50:09+05:30 IST
పెరుగుతున్న పెట్రోలు, బీజిల్ ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఎం నాయకులు అన్నారు.
నిడమనూరు, జూన్ 21: పెరుగుతున్న పెట్రోలు, బీజిల్ ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఎం నాయకులు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమ వారం మండల కేంద్రంలో ట్రాక్టర్ను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ మండల కార్యదర్శి కొండేటి శ్రీను మాట్లాడుతూ కేంద్రం లోని మోదీ ప్రభుత్వం నిత్యం పెట్రో ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు కొమాండ్ల గుర్వయ్య, నల్లబోతు సోమయ్య, కుంచం శేఖర్, వింజమూరి శివ, ఆంజనేయులు, పుల్లయ్య, కేశవులు, సత్యం పాల్గొన్నారు.